- ShareTweet
Waltair Veerayya twitter review : మెగాస్టార్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో వై.రవిశంకర్ మరియు నవీన్ యెర్నేని నిర్మించారు. శృతి హాసన్ హీరోయిన్ కాగా మాస్ మహారాజ్ రవితేజ ఒక కీలక పాత్ర పోషించారు. గాడ్ ఫాదర్ మూవీ హిట్ తరువాత బాస్ సినిమా కావడంతో అందులోనూ రవితేజ కూడా ఉండటంతో ప్రేక్షకులలో సినిమాపై బాగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్ షో పడిపోవడంతో, సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ట్విట్టర్ లో పంచుకుంటున్నారు.
వాల్తేరు వీరయ్య కథనం ఎలా ఉంది…
ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ మరియు పాటలు మంచి క్రేజ్ తో సినిమా మీద అంచనాలను మరింతగా పెంచాయి. జనవరి 13న సినిమా రిలీజ్ అయి మిశ్రమ స్పందనతో దూసుకుపోతోందనే టాక్ వినిపిస్తోంది. చిరంజీవి నటన, డాన్స్, కామెడీ బాగుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ బాస్ ఇమేజ్ తగ్గట్టు లేదని, నేరేషన్ బాగా ఫ్లాట్ గా ఉందని, సెకండ్ హాఫ్ కూడా ఏమంత ఆకట్టుకునేలా లేదని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. మరికొందరు సినిమా చాలా బాగుంది, పూర్వం బాస్ మళ్ళీ తిరిగివచ్చాడు అని కామెంట్ చేస్తున్నారు. ఇక ఫస్ట్ హాఫ్ ర్యాంప్, కామెడీ, ఇంటర్వల్ సీన్ ఇంకా ఫైట్స్ బాగున్నాయి అని కొంతమది కామెంట్ చేశారు.
Advertisem*nt
1st half k ramppp!! Racy & no dull moments. Intro, boss party song, comedy & interval bang rough aadinchaadu BOSS!! Thank you @dirbobby . 2nd half deenlo sagam unna enough. #WaltairVeerayya— Aditya (@Ad1tyaTwitz) January 13, 2023
Completed my show
1st half : enty is not up to Mark and forced scenes unwanted cringe scenes flat narrations..2nd half : nothing impressive Raviteja is good but chiru un nature acting made cringe and forceble..
Rating 1.5/5 strictly for none#WaltairVeerayya— viraj gowda (@thesnowdragonn) January 13, 2023
#WaltairVeerayya Overall an Average Commercial Entertainer!
Film is carried by Chiru along with a few good commercial sequences with RT and dance numbers. However, some of the comedy goes over the top and emotion does not work as expected. BGM is alright.
Rating: 2.5-2.75/5— Venky Reviews (@venkyreviews) January 12, 2023
Excellent frist half 🔥
Boss vintage comedy💥
Inka second half #RaviTeja entry tarawatha peaks kii vellipodi 🔥
Sankranti winner manama🤙
Congrats annd @dirbobby @RaviTeja_offl @KChiruTweets @MythriOfficial #WaltairVeerayya https://t.co/RezdXhZSZf— Nandu😈 (@MASS_99_99) January 13, 2023
చిరు, రవితేజ మధ్య సీన్స్ అలానే కామెడీ బాగానే పేలిందంటూ చెబుతున్న ఎమోషనల్ సీన్స్ అంతగా వర్క్ అవుట్ అవలేదంటూ కొందరు నెటిజన్స్ భావిస్తున్నారు. మొత్తానికి వాల్తేరు వీరయ్య వన్ మాన్ షో అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఫాన్స్ కి ఒకే కానీ కామన్ ఆడియన్ కి మాత్రం యావరేజ్ కమర్షియల్ సినిమా గాచెప్పొచ్చు. అయితే సినిమా ఫుల్ రివ్యూ రావాలంటే మాత్రం వేచి చూడాల్సిందే.
Advertisem*nt
Related Topics:
Continue Reading
Advertisem*nt
You may like
Featured
Published
6 hours ago
on
23 April 2024
By
lakshana
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisem*nt
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే..
ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Advertisem*nt
Continue Reading
Featured
Published
6 hours ago
on
23 April 2024
By
lakshana
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisem*nt
దాడికి ప్రయత్నమా..
ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
Advertisem*nt
Continue Reading
Featured
Published
6 hours ago
on
23 April 2024
By
lakshana
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisem*nt
కంచుకోటకు బీటలు..
ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.
Advertisem*nt
Continue Reading
Advertisem*nt
- Latest
- Popular
- Videos